- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
ప్రజాస్వామ్య స్ఫూర్తికి పల్లెలే నిదర్శనం అని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మండలంలోని అంకాపూర్ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది అని, ఓడిపోయామని నిరుత్సాహ పడకూడదని, గెలిచినవారు గ్రామా సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని, ఉదయం నుండే గ్రామాలలో పల్లె ప్రజలు ఓటు వేసేందుకు రావడం అభినందనీయమని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు.
- Advertisement -



