- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్కు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లా రాజధాని ఢాకాలోని వీసా దరఖాస్తుల కేంద్రాన్ని ఇండియా మూసివేసింది. ఆదేశ నేతల బెదిరింపు వ్యాఖ్యల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం షెడ్యూల్ చేసిన దరఖాస్తులను తర్వాత పరిశీలించనున్నట్లు పేర్కొంది.
- Advertisement -



