- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల – బత్తలూరు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 3 గంటల సమయంలో నేషనల్ హైవేపై తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



