నవతెలంగాణ-హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన మంగళవారం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్మెట్ సమీపంలోని బాటసింగారం వద్ద సర్వీస్ రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఓ బైక్పై ఉన్న ముగ్గురు విద్యార్థినులు కిందపడిపోయారు. అదే సమయంలో పక్క నుంచి వెళుతున్న లారీ కిందపడటంతో హంసలేఖ (22) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరీక్ష రాయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలు దిల్సుఖ్నగర్కు చెందిన విద్యార్థినిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



