- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ 31న రాత్రి బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. వైన్ షాపుల వద్ద కూడా మందుబాబులు భారీగా క్యూ కట్టారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. న్యూ ఇయర్ జోష్తో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం అమ్మకాలు వెయ్యి కోట్లు పెరిగాయి.
- Advertisement -



