Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంఫాస్టాగ్‌ యూజర్లకు ఊరట

ఫాస్టాగ్‌ యూజర్లకు ఊరట

- Advertisement -

ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం
నో యువర్‌ వెహికల్‌ (కేవైవీ) ప్రక్రియ నిలుపుదల


న్యూఢిల్లీ: ఫాస్టాగ్‌ యూజర్లకు ఊరట కల్పిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు, జీప్‌లు, వ్యాన్‌లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్‌ వెహికల్‌ (కేవైవీ) ప్రక్రియను నిలిపేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. దీనివల్ల లక్షలాది మంది యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది.వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలూ ఉన్నప్పటికీ కేవైవీ ప్రక్రియ కారణంగా ఫాస్టాగ్‌ యాక్టివేషన్‌లో జాప్యం జరుగుతున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ గుర్తించి ఈ నిబంధనను తొలగించింది.ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా కేవైవీ అవసరం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది.

ఫాస్టాగ్‌ను సరిగా అతికించకపోవడం, దుర్వినియోగం వంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ అవసరం పడుతుందని తెలిపింది. బ్యాంకులు ఫాస్టాగ్‌ ఇష్యూ చేసే సమయంలోనే వాహన్‌ డేటాబేస్‌లో వివరాలు వెరిఫై చేసి యాక్టివేట్‌ చేస్తాయి. ఫాస్టాగ్‌ సరైన వాహనానికి లింక్‌ చేసి ఉందా?విండ్‌ షీల్డ్‌కు సరిగా అతికించారా? లేదా? అనేది తెలుసుకోవడం కేవైవీ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో వాహనదారులు వాహనం ముందు, సైడ్‌ వ్యూ ఫొటోలు, ఆర్‌సీ, విండ్‌షీల్డ్‌కు అతికించిన ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కేవైవీ నిబంధన తొలగింపుతో ఇక ముందు ఆ ఇబ్బంది తొలగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -