- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆమె, హరీష్ రావు బీఆర్ఎస్లో ఉంటూనే ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల దుస్థితికి హరీష్ రావు నిర్ణయాలే కారణమని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలంతా హరీష్ రావు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
- Advertisement -



