Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు : ఏఐజాక్టో

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు : ఏఐజాక్టో

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐజాక్టో) ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) మినహాయించాలనీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటిఈ జోక్యం చేసుకుని సీనియర్‌ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలనీ, పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. జాతీయ విద్యావిధానాన్ని సమీక్షంచి ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే అంశాలను రద్దు చేయాలనీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఓటుహక్కు కల్పించాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల జాతీయ ఫెడరేషన్లు ఐక్యంగా నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసనల కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. యూయస్పీసీ, జాక్టో, ఎస్జీటీయు తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇదే స్పూర్తితో ఫిబ్రవరి 5న పార్లమెంటు మార్చ్‌ను విజయవంతం చేయాలని ఏఐజాక్టో నేతలు చావ రవి, జి.సదానందం గౌడ్‌, పి.మల్లికార్జున్‌ రెడ్డి, ఎ.వెంకట్‌, జుట్టు గజేందర్‌, పోల్‌ రెడ్డి, కె శారద ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -