- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
పశువులకు చేపట్టే చికిత్సల పట్ల పశు వైద్య డాక్టర్ వినీత్ కుమార్ కుర్లా గ్రామ పశువులదారులకు గ్రామస్తులకు పలు రకాల సలహాలు సూచనలు అందించారు. ఆ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరానికి వచ్చిన పశువులకు గర్భకోశ చికిత్సలు 36 సాధారణ చికిత్సలు 19 దూడలకు నట్టల నివారణ 200 నిర్వహించినట్లు డాక్టర్ వినీత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్లా గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు అశోక్ పటేల్, ఉపసర్పంచ్ కుటుంబ సభ్యులు గోపాల మిత్రులు, పశువైద్య సిబ్బంది గ్రామ పెద్దలు పశువుల దారులు పాల్గొన్నారు.
- Advertisement -



