- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రంలోని మహిళా భావనంలో విద్యుత్ సదుపాయం లేక మహిళలు సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై తాజాగా మహిళలు గురువారం సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన పాలకవర్గంతో చర్చించి, మహిళ భవనంలో విద్యుత్ మీటర్ బిగించారు. మేము అడిగిన వెంటనే స్పందించడమే కాకుండా.. సర్పంచ్ సమస్యను పరిష్కరిచారని వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమములో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మహిళ సంఘం అధ్యక్షురాలు రాజమణి, సిసి అనురాధ, వార్డు సభ్యులు శ్రవణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



