- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంతపెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం.. వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే.. పోలీసులు వసూలు చేసుకొవచ్చని కోర్టు పేర్కొంది. వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్టప్రకారం కోర్టు నోటీసులివ్వాలని ఆదేశించింది.
- Advertisement -



