- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలోని 6వ వార్డులో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే రాజకీయ ప్రచారంలో భాగంగా గోడరాతలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఈ తరహా ప్రచారం జరగడం పట్ల స్థానికులు చర్చించుకుంటున్నారు. మాజి మంత్రి జీవన్ రెడ్డి వర్గం,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి ఎవరికీ టికెట్ దక్కుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ గోడరాతలు వేయించడంపై పట్టణంలో రాజకీయ ఆసక్తి నెలకొంది.
- Advertisement -



