- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. మద్యం మత్తులో జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణం తీసింది. గోమారం లక్ష్మారెడ్డి (42), తన ఇంట్లో అద్దెకు ఉంటున్న గొర్రెల కాపరి మలిగ లింగం (50)తో కలిసి రాత్రి మద్యం సేవించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన లింగం గొడ్డలితో లక్ష్మారెడ్డి తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



