- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంఠాలీ జిపి లో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి కి పలు సూచనలు చేశారు. గ్రామానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏవి ఉంచకూడదని అన్నారు. పన్నులు 100% వసూలు అయ్యే విధంగా గ్రామ ప్రజలను అవగాహన చేసి వారి వద్ద నుంచి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఉంచాలని పెండింగ్లో ఉంచకూడదని జిపి కార్యదర్శిని ఆదేశించారు. గ్రామాభివృద్ధికి తమ వంతుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని తెలిపారు. గ్రామపంచాయతీ సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు.
- Advertisement -



