నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని రామడుగు గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా 81 మంది గ్రామస్థులకు ఎక్సరే, తేమడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా మన భారత ప్రధాని చేపట్టినటువంటి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు వచ్చి ఎక్స్ రే, తెమడ పరీక్షలు, రక్త పరీక్షలు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, జిల్లా టీబి, కోఆర్డినేటర్ నరేష్, వార్డ్ మెంబర్లు, టిబి సూపర్వైజర్ స్రవంతి, రేడియోగ్రాఫర్ సురేందర్, కౌన్సిలర్ శివకుమార్ సాయికిరణ్ ప్రశాంత్, వైద్య సిబ్బంది హారిక, కమలా, సవిత, రూపకాల, ఉమారాణి, కవిత పాల్గొన్నారు.
సర్పంచ్ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


