- Advertisement -
– ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ – కామారెడ్డి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 2వ తేదీన ఐడీఓసీ భవనంలోని 25వ గది నంబర్లో సమర్పించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఇంచార్జీ కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు.
- Advertisement -



