- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నిన్న నల్గొండ జిల్లా వేములపల్లిలో 46.5°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా సుమారు 46.4°C వరకు నమోదయ్యాయి. రాబోయే 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
- Advertisement -



