- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్టిండీస్ పర్యటనకు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ కు కొత్త సారథిగా కుసాల్ మెండిస్ను నియమించింది. ఐపీఎల్ ఆడుతున్న దాసున్ శనక, చరిత్ అసలంకలను పక్కనపెట్టి ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ఈ పర్యటనలో భాగంగా జూన్ 3 నుంచి వెస్టిండీస్ జట్టుతో శ్రీలంక మూడు ఫార్మాట్లలో సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన కోసం మే 26న శ్రీలంక జట్టు వెస్టిండీస్ బయలుదేరి వెళ్లనుంది.
- Advertisement -



