- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.3గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. మెహర్, బిద్ధన్ అఖండ్ ప్రాంతాలలోని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు పాటు ఖతార్, యూఏఈలోనూ స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.
- Advertisement -



