- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ 32 స్థానాలు మెరుగుపడి 32వ ర్యాంక్కు చేరుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20లో అతను 43 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ అగ్రస్థానంలో, ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నారు. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి టాప్లో ఉండగా, అర్ష్దీప్ సింగ్ 14వ ర్యాంకుకు, అక్షర్ పటేల్ 17వ ర్యాంకుకు చేరుకున్నారు. ఆల్రౌండర్లలో సైమ్ ఆయూబ్ టాప్లో, హార్దిక్ పాండ్య మూడో ర్యాంక్లో, శివమ్ దూబె 9వ ర్యాంకులో కొనసాగుతున్నారు.
- Advertisement -



