నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలోని 11వ వార్డులో నీటి సమస్య ఉన్నదని, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ దృష్టికి, కౌన్సిలర్ జూకంటి సంపత్ తీసుకెళ్లగా, వెంటనే స్పందించి నవజీవన్ బీడీ కంపెనీకి ఎదురుగా ఉన్న ఖాళీ బోర్ నందు కొత్త మోటర్ ని మంగళవారం ఏర్పాటు చేశారు.
నూతన బోర్ ఏర్పాటుతో
కొన్ని రోజులుగా వార్డులో నీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రజలకు సమస్య తీరినట్లు అయింది. వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్ బిజన బాలమణి భాస్కర్ కి వార్డు ప్రజల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 11వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్, మాజీ కౌన్సిలర్ జూకంటి శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు జూకంటి రమేష్, మున్సిపల్ సిబ్బంది రాజు, సురేందర్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.



