- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
మండలంలోని రైతు వేదికలో బుధవారం సమీప గ్రామాల పరిధిలోని ఆయా గ్రామాల వార్డు సభ్యులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో వార్డు సభ్యులకు వారి బాధ్యతలు, హక్కులు, ప్రభుత్వ పథకాలు, నిధులు వంటి అనేక అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి అండాలమ్మ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



