- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లో విద్యార్థి వీసాపై వచ్చి డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ, సెల్ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. యెమెన్కు చెందిన అబ్దురబు, పాలస్తీనాకు చెందిన హసన్ డబ్ల్యూ.ఎ.హషేం కలిసి హైదరాబాద్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అబ్దురబు గతంలోనూ డ్రగ్స్ సరఫరా కేసుల్లో ఆరుసార్లు అరెస్ట్ అయ్యాడు.
- Advertisement -



