- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు 2,676 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు bse.telangana.gov.in వెబ్సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ (8096958096) ద్వారా కూడా హాల్ టికెట్లు పొందే సదుపాయం కల్పించారు. పరీక్షల నిర్వహణపై సందేహాల నివృత్తికి 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
- Advertisement -



