నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా సెమీఫైనల్ 2 జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో చివరి ఓవర్ శివమ్దూబె.. కాస్త భయానికి గురయ్యానని తెలిపాడు.
‘ఓవర్లో మొదటి రెండు బంతులు చాలా కీలకమని నాకు తెలుసు. అవే మ్యాచ్ విజేతను నిర్ణయిస్తాయి. అందుకే నేను దాని మీద దృష్టి పెట్టాను. ఆ సమయంలో భయానికి గురయ్యాను. వరల్డ్ కప్ సెమీఫైనల్లో చివరి ఓవర్ బౌలింగ్ వేయడం ఎప్పటికీ ఛాలెంజింగే’ అని శివమ్ దూబె వివరించాడు.
‘బెథెల్ సెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ వేయడం కఠినమని నాకు తెలుసు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని, నా సామర్థ్యాలను విశ్వసించాలని నాకు నేను గట్టిగా అనుకున్నాను. అలాంటి సమయంలో 10 శాతం ప్రదర్శన చేసినా.. అది చాలా మేలు చేస్తుంది’ అని దూబె అన్నాడు.



