- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వేతనాన్ని మూడేళ్ల కాలానికి రూ.6,361 కోట్లు (692 మిలియన్ డాలర్లు)గా నిర్ణయించింది. మార్చి 7, 2026 నాటికి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ మొత్తంలో పర్ఫామెన్స్ స్టాక్ యూనిట్స్, వార్షిక వేతనం, స్టాక్ ఇన్సెంటివ్స్, వెయిమో, వింగ్ ఏవియేషన్ షేర్ల ద్వారా వచ్చే ఆదాయం ఉన్నాయి. 2004లో గూగుల్లో చేరిన పిచాయ్, క్రోమ్, ఆండ్రాయిడ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2015లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, కంపెనీ విలువను ఏడు రెట్లు పెంచారు.
- Advertisement -



