- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
బీఎస్పీ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా డాక్టర్ నిరడి లక్ష్మణ్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ నియమించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా డాక్టర్ నిరడి లక్ష్మణ్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. తనపై నమ్మకంతో జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ చీఫ్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం, గైని గంగాధర్, నిరడి ఈశ్వర్, బిఎస్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సింగడి పాండు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



