- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: 108మంది మావోయిస్టులు లొంగిపోయారని ఛత్తీస్గఢ్ అధికారులు బుధవారం తెలిపారు. వారిపై రూ.3.95కోట్ల రివార్డు ఉందని అన్నారు. దంతెవాడ నుండి 30మంది, సుక్మా నుండి 18మంది, బస్తర్ నుండి 16మంది, నారాయణపూర్ నుండి నలుగురు మరియు కాంకెర్లో నుండి ముగ్గురు లొంగిపోయారని, వీరంతా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వారని భద్రతాదళాలు తెలిపాయి. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమాండర్లు ఉన్నారని, ఒక్కొక్కరిపై ఎనిమిది లక్షల వరకు రివార్డు ఉందని పేర్కొన్నాయి. వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి.
- Advertisement -



