- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎస్బీఐ ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రూరల్ కమ్యూనిటీస్, ఎన్జీవోలతో కలిసి 13 నెలలు పని చేయాలి. డిగ్రీ పూర్తి చేసి 21-31 ఏళ్ల వయసున్న విద్యార్థులు అర్హులు. నెలకు రూ.21 వేల అలవెన్సులతో పాటు ఫెలోషిప్ పూర్తయిన తర్వాత రూ.1,10,000 గ్రాంట్ అందజేస్తారు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://youthforindia.org/application/
- Advertisement -



