- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్లోని దక్షిణ ద్వీపంలో టె అనౌ పట్టణ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రం టె అనౌకు ఉత్తరాన సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. USGS, GFZ సంస్థలు భూకంప తీవ్రతను 5.9గా వెల్లడించాయి. భూమికి 50 కిలోమీటర్లకు పైగా లోతులో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సునామీ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
- Advertisement -



