- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం కావడంతో పరీక్షలు వ్రాసే హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవతరతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని, మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నానన్నారు. మీ మంచి భవిష్యత్తు కి ఇది పునాది లాంటిదని పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి వారి కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు. అదే విధంగా మంచి ఉత్తీర్ణత సాధించి తల్లి తండ్రులకు, మీ అధ్యాపకులకు మంచి పేరు తీసుకరావాలన్నారు.
- Advertisement -



