నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం మొదటి రోజున పదవ తరగతి పరీక్షలు ప్రారంభించడంతో పరీక్ష కేంద్రాన్ని ప్లైయంగ్ స్క్వాడ్ సిద్ద పద్మ తో పాటు మండల తహసీల్దార్ శివరాజ్, ఎస్ ఐ శ్రీనివాస్ లు వేరు వేరుగా అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పరీక్ష కేంద్ర తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల పరీక్ష సరళిని పరిశీలించారు. పరీక్షలను పక్కడబందిగా నిర్వహించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రానికి నలుమూలలుగా 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు చేపడతామని సూచించారు. వారి వెంట మండల విద్యాధికారి విజయ్ కుమార్ చీఫ్ సూపర్డెంట్లు డిపార్ట్మెంట్ అధికారి తదితరులున్నారు.
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



