- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని నవలూరులో ఆదివారం LPG గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సంజయ్ కుమార్ ఇంట్లో గ్యాస్ లీక్ అయి, స్టవ్ వెలిగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
- Advertisement -



