- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో తొలిరోజు భాగంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రసంగించారు. గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం లక్ష్య సాధనలో అందరికీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది అన్నారు. విజన్ 2047 దిశగా.. సాహసోపేతమైన విధానాలతో విజనరీతో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
- Advertisement -



