- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీసీసీఐ వార్షిక నమన్ అవార్డుల వేడుకలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా, ప్రపంచ వేదికపై భారత క్రికెట్ టీమ్స్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించాలనే తన కల నెరవేరుతోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. గత రెండేండ్లలో మెన్స్, విమెన్స్, జూనియర్ జట్లు ప్రపంచ స్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాయని కొనియాడారు. అమ్మాయిల క్రికెట్ అభివృద్ధిలో ఐసీసీ చీఫ్ జై షా పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. తన కెరీర్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఎంతో ప్రభావితం చేశారని వెల్లడించారు..
- Advertisement -



