నవతెలంగాణ-కుభీర్
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుకునే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి జిల్లాలోని కుభీర్ మొదటి స్థానం ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మండల విద్యాధికారి విజయ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా 201 మంది విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పెన్సిల్, తదితర సామాగ్రిలను పంపిణీ చేయడం. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ. మంచి ఫలితాలు సాధించి మరింత ఉన్నత స్థాయికి ఎదిగేలా పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీప్ సూపర్ డెంట్స్ , డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు ఉన్నారు.
మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



