- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన పురస్కరించుకుని ఈదు ముబారక్ అందిస్తున్న తోపా కిట్లలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో సర్పంచ్ బండి స్వామి ముస్లిం సోదరులకు తోపా కిట్లను అందించారు. ముస్లిం సోదరులు కలిసి మెలిసి సుఖశాంతులతో రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
- Advertisement -



