- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మొయినా బాద్ ఫార్మ్ హౌజ్ డ్రగ్స్ కేసులో విచారణను పోలీసులు స్పీడప్ చేశారు. ముగ్గురు నిందితులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత శర్మలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు . ఉప్పర్ పల్లి కోర్టు ముగ్గురు నిందితులను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ముగ్గురిని చంచల్ గూడ జైలు నుంచి శంషాబాద్ రూరల్ పీఎస్ కు తరలించారు. శంషాబాద్ రూరల్ పిఎస్ లో ముగ్గురు నిందితులను డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ విచారిస్తోంది.
- Advertisement -



