- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ వరల్డ్ వస్త్రాలయాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. భువనగిరి పట్టణ ప్రజలకు, ముఖ్యంగా పిల్లల కోసం అత్యాధునిక డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. చిన్నారుల కోసం అన్ని రకాల వెస్ట్రన్, ఎత్నిక్ బ్రాండెడ్ కలెక్షన్స్ ఒకే చోట లభించడం పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, షోరూం యజమాని సాయి, నిఖిలేశ్వర్ పాల్గొన్నారు.
- Advertisement -



