అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
ఐడీఓసీలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ హాజరై దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి అధికారులతో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి శరత్, ఎగుట్ల కనకయ్య, నాగం కుమార్, చిమల్ల మల్లేశం,స్తంబ లచ్చయ్య , వేముల నాగరాజు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



