- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న DRDO మాజీ ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది యాత్రికుల బృందంలో వీరు ఉన్నారు. యాత్రకు వెళ్లిన కొద్ది గంటల్లోనే వరదలు సంభవించాయి. ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం టిబెట్లోని సాగా ప్రాంతంలో ఉన్నామని, త్వరలోనే భారత్కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని తెలిపారు.
- Advertisement -


