- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలంలోని సుద్దులం గ్రామానికి చెందిన తినేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరంలో 468 మార్కులతో (మొత్తం 470లో) రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి గ్రామానికి, జిల్లాకు గౌరవం తీసుకువచ్చారు. ఈ సందర్భంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించి అభినందించారు. అలాగే ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాలలో రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తినేటి లక్ష్మణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -