Friday, June 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమాజాన్ని సరైన బాటలో నడిపేదే కవిత్వం

సమాజాన్ని సరైన బాటలో నడిపేదే కవిత్వం

- Advertisement -

రాజీవ్‌ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం.. : ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా
‘తెలంగాణ యువ కెరటాలు’ పేరిట యువ కవుల సమ్మేళనం
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌

తెలంగాణ ఉద్యమ కాలంలో యువత ఆత్మ బలిదానాలను కవులు వారి కవితల ద్వారా చెప్పేవారని, సమాజాన్ని సరైన బాటలో నడిపేదే కవిత్వం అని, భవిష్యత్‌ తెలంగాణ అభివృద్ధి కోసం మన నీళ్లు, వనరుల రక్షణపై కవిత్వం రావాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జూన్‌ 2న తెలంగాణ యువకుల కోసం రాజీవ్‌ గాంధీ యువ వికాస్‌ పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారని, రాజీవ్‌ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం ఉందని తాము ప్రశ్నించామని తెలిపారు. తెలంగాణ అమరవీరుల పేరు పెట్టాలని తాము ప్రతిపాదించామని, ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారని, ఇది జాగృతి విజయం అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాంతా చారి, యాదిరెడ్డి సువర్ణ పేర్లు పెట్టారని ఆమె సూచించారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో ‘తెలంగాణ యువ కెరటాలు’ పేరిట యువ కవుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తాను గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే ప్రశ్నించానని, ప్రజల పక్షాన ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే బతుకమ్మ వందేండ్లు బతికి ఉంటదని, యువ కవులు కవితలు రాస్తే తెలంగాణ సాహిత్యం వందేండ్లు బతికి ఉంటదని అన్నారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్‌ చారి పుట్టిన రోజు, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం సంతోషకరమన్నారు. సాహిత్యం, సంస్కృతి వర్ధిల్లిన నేల బాగుంటుందని తెలిపారు. 35 ఏండ్ల లోపు వయసున్న యువ కవులు అన్ని భాషల్లో కవిత్వం రాయాలనే ఆకాంక్షతో ఈ కవి సమ్మేళనం నిర్వహించినట్టు చెప్పారు. తెలంగాణ బిడ్డలకు ధిక్కారం ఎలా ఉంటుందో మమకారం కూడా అంతే ఉంటుందన్నారు. కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదన్నారు. పాలనలో లోపాలను ఎత్తి చూపాల్సిందేనని అన్నారు. నిర్భయంగా చెప్పేవాడే నిజమైన కవి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో యువత ఆత్మ బలిదానాలను కవులు వారి కవితల ద్వారా చెప్పేవారని, భవిష్యత్‌ తెలంగాణ అభివృద్ధి కోసం మన నీళ్లు, వనరుల రక్షణపై కవిత్వం రావాలన్నారు. సమాజాన్ని సరైన బాటలో నడిపేదే కవిత్వం అని, తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు జాగృతి ఆధ్వర్యంలో చేయాల్సి ఉందని, దానికి మీ సహకారం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాలేశ్వరం శంకరం, చమన్‌, గొల్ల శివశంకర్‌, రమేష్‌ నాయక్‌, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -