సీఎం రేవంత్రెడ్డితో జపాన్లోని కితాక్యూషు మేయర్ టకేచీ భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్కు, జపాన్లోని కితాక్యూషుకు మధ్య విమాన సర్వీసుల కోసం ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్లో తాను జపాన్లో పర్యటించినప్పుడు అక్కడి అభివద్ధిని, ప్రజా ప్రతినిధుల పనిని చూశానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్కు విచ్చేసిన కితాక్యూషు నగర మేయర్ కజుహిసా టకేచీతో సీఎం రేవంత్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కితాక్యూషు నగరం ఎకో-టౌన్ మోడల్తో తాను చాలా ప్రేరణ పొందానని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్లో అలాంటి నమూనాను అభివృద్ధి చేసేందుకు పలు జపనీస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. ఆ క్రమంలో తమ ప్రభుత్వం, కితాక్యూషు పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలు తదితరాంశాల్లో సహకారానికి పునాది కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూసీ నది అభివృద్ధి, దాని పునరుజ్జీవ ప్రాజెక్టుపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణ యువతకు నైపుణ్యాలు కల్పించటం కూడా తమ బాధ్యతని అన్నారు. ఈ క్రమంలో ఇక్కడి విద్యార్థులు జపనీస్ భాషను నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతు న్నారని, తద్వారా జపాన్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎం వివరించారు. ఇందుకు సహకరించాలని టకేచీని ఆయన కోరారు.
హైదరాబాద్ – కితాక్యూషుకు మధ్య విమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES