Saturday, June 28, 2025
E-PAPER
Homeఆటలున‌న్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్: కోహ్లీ

న‌న్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్: కోహ్లీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిన్న రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)ను ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీని ముద్దాడి, అభిమానుల గుండెల్లో ఆనందం నింపింది. ఎన్నో సీజన్లుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల ఆశలు ఈ విజయంతో ఫలించాయి.

నీకోసం 18 ఏళ్లు ఎదురుచూశా ఫ్రెండ్
ఈ విజయంపై కింగ్ కోహ్లీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించాడు. త‌న‌ సంతోషాన్ని పంచుకుంటూ… “ఈ జట్టు కలను సాకారం చేసింది. ఈ సీజన్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. గత రెండున్నర నెలలుగా ఈ ప్రయాణాన్ని మేం పూర్తిగా ఆస్వాదించాం. కష్టకాలంలో కూడా మమ్మల్ని వీడని ఆర్సీబీ అభిమానులకు ఈ విజయం అంకితం. ఎన్నో ఏళ్ల నిరాశ, నిస్పృహలకు ఇది సమాధానం. ఈ జట్టు కోసం మైదానంలో పడిన ప్రతీ కష్టానికి ఇది ప్రతిఫలం. ఐపీఎల్ ట్రోఫీ.. నిన్ను ముద్దాడ‌టం కోసం న‌న్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్‌. కానీ, ఆ ఎదురుచూపులు నిజంగా విలువైన‌వే అని నిజం చేశావ్‌” అని కోహ్లీ త‌న ఇన్‌స్టా స్టోరీలో ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చాడు. దీనికి ట్రోఫీతో ఆర్‌సీబీ జ‌ట్టు సంబ‌రాల ఫొటోలను జోడించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -