Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుక్యూబాకు అండగా సంఘీభావ నిధి

క్యూబాకు అండగా సంఘీభావ నిధి

- Advertisement -

– ఆ దేశానికి సహాయం చేసేందుకు ముందుకు రావాలి
– ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి
నవతెలంగాణ – ముషీరాబాద్‌

క్యూబాకు అండగా నిలిచి సంఘీభావం తెలపాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి కోరారు. ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం హైదరాబాద్‌ సుందరయ్య పార్క్‌ పరిసర ప్రాంతాల్లో క్యూబా సంఘీభావ నిధిని సేకరించారు. ఈ సందర్భంగా మల్లు లకిë మాట్లాడుతూ.. కూబాకు ఆర్థిక సహాయం అందించడం అత్యవసరమని, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవతా దృక్పథంతో ప్రపంచం ఈ ఆంక్షలను ఎదిరించి క్యూబా ప్రజలకు సహాయం అందించాలని, ఈ ఆంక్షల రద్దు కోసం ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాలని కోరారు. క్యూబా ప్రజల ఆకాంక్షలు, మానవ హక్కుల గౌరవం కోసం వారు చేస్తున్న పోరాటానికి మనం వారితో కలిసి అండగా నిలబడాలని చెప్పారు. అరుణజ్యోతి మాట్లాడుతూ.. క్యూబా కోటి 11 లక్షల మంది జనాభా గల చిన్న దేశం అని తెలిపారు. దానిపై అగ్రరాజ్యం అమెరికా 65 ఏండ్లుగా ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధిస్తోందని, అయినా తట్టుకొని తలెత్తుకొని నిలబడుతోందని చెప్పారు. అమెరికా ఆంక్షలు క్యూబా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. వివిధ దేశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై నిషేధం విధించినట్టు తెలిపారు. క్యూబా ప్రజల ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఔషధాలు, ఇంధనం, విద్య, ఆహార భద్రత వంటి రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అత్యవసర వస్తువుల కొరత క్యూబా ప్రజల జీవనాన్ని దుర్భరం చేసిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్‌.ఆశాలత, వి.కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -