నవతెలంగాణ జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెండ్లి బృందం కారును డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 నెలల చిన్నారి రుద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. వరుడు సహా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి నాందేడ్ నుంచి హుజూరాబాద్కు పెండ్లి బృందం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వరుడు గాయపడటంతో వివాహం ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మహేశ్ (వరుడు), వాగ్మేర సితాల్, వాగ్మేర మారుబాయి, వాగ్మేర దినేశ్, వాగ్మేర సోనాలి, డ్రైవర్ గణేశ్ గాయపడ్డారు. చిన్నారి మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాసేపట్లో పెండ్లి బాజాలతో హంగామా జరగాల్సిన ఇల్లు కాస్తా విషాదంలో మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పెండ్లిలో ఘోర విషాదం… చిన్నారి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES