Saturday, June 7, 2025
E-PAPER
Homeబీజినెస్పీఅండ్‌జీలో 7వేల మంది ఉద్యోగులపై వేటు

పీఅండ్‌జీలో 7వేల మంది ఉద్యోగులపై వేటు

- Advertisement -

వాషింగ్టన్‌: ప్రముఖ గ్లోబల్‌ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ప్రాక్టర్‌ అండ్‌ గ్లాంబుల్‌ వచ్చే రెండేళ్లలో తమ ఉద్యోగుల్లో 15 శాతం మందిని ఇంటికి పంపించాలని నిర్ణయిం చింది. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న ఉద్యోగుల్లో దాదాపు 7,000 మందిపై వేటు వేయనున్నట్టు వెల్లడించింది. స్థానిక చట్టాలకనుగుణంగా తొలగింపులను చేపట్టనున్నట్టు తెలిపింది. ప్రాంతాల వారిగా ఎంత మందిని తొలగించేది ప్రస్తుతం సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. ఉద్వాసనలకు సంబంధించి రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రణాళికలు అమలు చేయబడతాయని ఆ కంపెనీ తెలిపింది. ”వాటాదారులకు నగదు రాబడిపై తమ బలమైన ట్రాక్‌ రికార్డ్‌ను కొనసాగిస్తాము. ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి మూడు త్రైమాసికాల్లో వాటాదారులకు 13 బిలియన్‌ డాలర్ల విలువ చేసే డివిడెండ్‌, షేర్ల పునకొనుగోళ్ల ద్వారా అందించాము.” అని పిఅండ్‌జి చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఆండ్రీ షుల్టెన్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శైలేష్‌ జెజురికార్‌ పేర్కొన్నారు. ”పోటీ తీవ్రంగా ఉంది. భౌగోళిక రాజకీయ వాతావరణం అనూహ్యంగా ఉంది. సాంకేతికత రోజువారీ జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని వేగంగా మారుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం సేవలు అందని, తక్కువ సేవలు పొందుతున్న వినియోగదారుల అవసరాలను మెరుగ్గా తీర్చడం, కొత్త విభాగాలలోకి విస్తరించడం, మార్కెట్‌లను అత్యుత్తమ స్థాయిలకు పెంచడం ద్వారా భారీ వృద్ధిపై దృష్టి సారిస్తున్నాము.” అని ఆ కంపెనీ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -