విద్యాధికారి శ్రీనివాస్
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రయివేట్ పాఠశాలు వద్దే వద్దని.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దని మండల విద్యా శాఖధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఘన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల హరిజన పాఠశాలల ఆధ్వర్యంలో బడి బాట సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తు విద్యార్థులకు మెరుగైన జీవన విధానానికి తొడపాడు తుందన్నారు. మండలంలో పిల్లల తల్లి తండ్రులు పక్క ఉన్న వారిని చూస్తూ వీరికి స్థోమత లేకున్నా అప్పులు చేసి మరి ప్రయివేట్ బడుల్లో చేర్పించి, చివరకు వారి చదువు పూర్తి కాకుండానే మానేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఘనపూర్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతు మా పాఠశాలలో విద్యార్థులకు మేము మా స్నేహితుల సహకారం తో ప్రయివేట్ కు దిటుగా విద్యార్థులందరికి స్కూల్ యూనిఫామ్,స్పోర్ట్స్ డ్రెస్ ఉచితంగా అందించడం జరిగిందని వివరించారు.చదువులో కూడ ప్రయివేట్ కు దిటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. మొన్న జరిగిన పదోతరగతి పరీక్షల్లో 28 రాస్తే 27 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, అందులో ఒక్కరికి 493 మార్కులు వచ్చినట్లు పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో మా పాఠశాలను మండలం లోనే ప్రథమ స్థానం సాధిస్తామని అశాభావం వ్యక్తం చేశారు.వాసరి సాయినాథ్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్న కొందరు తల్లి తండ్రులు ప్రయివేట్ పాఠశాలలో చేర్పించి అప్పుల పాలవుతున్నారని అన్నారు.ప్రయివేట్ విద్య కు చేసే ఖర్చు, అదా చేస్తే అమ్మాయిలకు పెండ్లికి, అబ్బాయిలకు బిజినెస్ కు ఉపయోగ పడుతుందన్నారు. ప్రయివేట్ లో చదివిన విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు చదువుతో పాటు మానసిక దైర్యం పేరుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హరిజన వాడ ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, రామకృష్ణ, విడిసి సభ్యులు గంగాధర్, తిరుపతి, మహీందర్, యువత మోహన్, గంగమోహన్ పాల్గొన్నారు.
ప్రయివేటుకు వద్దే వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES