నవతెలంగాణ-భిక్కనూర్
బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని మండల విద్యా వనరుల అధికారి రాజా గంగారెడ్డి మండల ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతొ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో నమోదయ్యేలా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యను వివరించాలన్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఉపాధ్యాయులను తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి శ్రీనాథ్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలి: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES